ముసునూరు: తమ పొలంలో పండించే ప్రతి పంటకు ఇ-క్రాప్ నమోదు చేయించుకుని ఇకెవైసి చేయించుకోవాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జివివి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం మండలంలో ఎడి ఎస్.మధుమోహన్, తహశీల్దార్ దాసరి సుధల ఆధ్వర్యంలో వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎడి మాట్లాడుతూ రైతులు పండించే ప్రతి పంటకు తప్పనిసరిగా ఇ-క్రాప్ నమోదు చేయించుకోవాలని తెలిపారు.










