Nov 10,2023 21:20

ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌
విజయం బిజినెస్‌ స్కూల్లో దీపావళి సంబరాలు ఎంబీఏ ఎంసీఏ విద్యార్థులు శుక్రవారం ఘనంగా జరిపారు . ఈ సందర్బంలో విజయం విద్యాసంస్థల అధినేత డా. తేజోమూర్తి మాట్లాడుతూ చీకటి నిరాశ నిస్పహలకు, అజ్ఞానానికి గుర్తుగా భావిస్తారని కాంతి (వెలుగు) ఆనందానికి, ఉత్సాహానికి ప్రతీక అని, అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానమనే వెలుగులోనికి పయనించి జీవితములో కొత్త అర్ధాలు వెతుక్కోవాలని తెలిపే ఉద్దేశ్యమే దీపావళి అని విద్యార్థులకు తేలియచేస్తూ విద్యార్థులందరూ వెలుగు వైపు పయనించి మీ మీ జీవితాలలో వెలుగు నిండాలని ఆశించారు. ఈ సందర్భంగా అకాడమిక్‌ డైరెక్టర్‌ శైలజామూర్తి మాట్లాడుతూ దీపం ఉన్న చోట ఐశ్యర్యం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్‌ డా. వి. మురళి కష్ణ, డా. శేషగిరిరావు, కవిత, డా. జయంత్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.