
ప్రజాశక్తి-మామిడికుదురు
మామిడికుదురులో గోకవరపు గణాధిపతి జిల్లా పరిషత్ హైస్కూల్లో 1980-81 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు 43 ఏళ్ల తర్వాత ఆదివారం ఆత్మీయ కలయక ఘనంగా నిర్వహించారు. ఆనాటి గురువులు యేరుబండి బాస్కరరావు, అంబటి సత్యనారాయణమూర్తి, నీతిపూడి చందర్రావు లకు పూలమాలలు వేసి శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. వారందరూ ఉద్యోగ ఉపాధి పేరిట వివిధ రాష్ట్రాలలో, పలు జిల్లాలలో ఉన్నత హోదాల్లో ఉన్నారు. అలనాటి జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. వారందరూ గ్రూపుగా ఫొటోలు తీసుకుని జ్ఞాపకాలు పదిల పరుచుకున్నారు. కుటుంబ సమేతంగా చిరునామాలు తెలుసుకొన్నారు. ప్రతి ఏటా అపూర్వ కలయికలు ఏర్పాటు చేసుకుని నగదు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించుకున్నారు.