Oct 29,2023 22:55

ప్రజాశక్తి-ఆలమూరు
మండలంలోని చెముడులంక ఎస్‌టిఎస్‌ఎన్‌ఎం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల్లో 1977 నుంచి 1982 సంవత్సరం వరకు చదివిన పూర్వ ్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆరు నుంచి పదవ తరగతి వరకు ఐదేళ్లు పాటు ఈ పాఠాల్లో పూర్వ విద్యార్థులంతా కలిసి చదువుకున్నారు. సుమారు 47 మంది మిత్రుల్లో ఇన్నేళ్ల తర్వాత 40 మంది కుటుంబ సభ్యులతో వచ్చి ఆ'పాత' మధురాలను గుర్తుకుతెచ్చుకున్నారు. తమ గురువులను సత్కరించారు. ఇటీవల కాలంలో అకాలంగా మతి చెందిన సహచరులకు శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు. సమాజంలో ఆదర్శవంతమైన వ్యక్తులుగా జీవించి విద్య నేర్చుకున్న పాఠశాలకు, నేర్పిన గురువులకు, పెరిగిన ప్రాంతానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని విశ్రాంతి ఉపాధ్యాయులు సూచించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సత్కారం పొందిన రామలింగేశ్వరరావు మాస్టారు (సైన్స్‌, లెక్కలు), కీర్తి రామం మాస్టారు (సోషల్‌ స్టడీస్‌), గన్ని ప్రసాద్‌ మాస్టర్‌ (ప్రధానోపాధ్యాయులు) తమ స్పందనను తెలిపారు. పూర్వ విద్యార్ధుల కలయిక కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా ప్రజాహిత కార్యక్రమాలకు ఒకరికొకరు సహకరి ంచుకునే విధంగా చేయూత నివ్వాలని పూర్వ విద్యార్థులు అన్నారు. ఎవ్వరికీ ఎలాంటి అవసరం వచ్చినా అందరం కలిసి భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఏటా కలుసుకుంటూ కష్టసుఖాలను పంచుకుంటూ పాఠశాల అభివృద్ధికి, మన తోటి సహచరులకు అవసరమైన సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయాలని వారంతా ఆకాంక్షించారు.