
ప్రజాశక్తి- రేణిగుంట
రేణిగుంట జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలల లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులు, సైన్సు ఉపాధ్యాయులు ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సభలో జనవిజ్ఞాన వేదిక తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు ఓ వెంకట రమణ మాట్లాడుతూ '' సైన్స్ మానవులకు సౌకర్యవంతమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇచ్చిందన్నారు. ఆయ్ణుప్రమాణాన్ని పెంచిందన్నారు. ప్రజలందరికీ తప్పనిసరిగా కనీస శాస్త్రీయ అంశాలు తెలియజేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు. సూడోసైన్స్, యాంటీసైన్స్కు వ్యతిరేకంగా అసలైన సైన్స్ను ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సైన్సు అధ్యాపకులు విజయకుమార్ ఉపాధ్యాయులు మోహన నాయుడు, జనవిజ్ఞాన వేదిక నాయకులు ఇమామ్ పాల్గొని ప్రసంగించారు