
ప్రజాశక్తి - భీమడోలు
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా భీమడోలు శాఖా గ్రంధాలయంలో తెలుగు భాష ప్రాముఖ్యత అంశంపై విద్యావేత్తల సహకారంతో శుక్రవారం చర్చాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశ్రాంత, ఉపాధ్యాయ ప్రముఖులు టివి.ఉమామహేశ్వరరావు, మండే సుధాకర్, బాబురత్నం నిర్వహించారు. అనంతరం గ్రంధ పాలకులు కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రంథాలయాలు ముద్దు-సెల్ఫోన్లు వద్దు అంశంపై వ్యాసరచన పోటీలు చేపట్టారు. గుండుగొలను శాఖా గ్రంథాలయంలో గ్రంథ పాలకులు జి.నాగమణి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం, బాలికా విద్య ఆవశ్యకత అంశంపై వకృత్వ పోటీలు, వేమన పద్యాల ఆలాపన పోటీలు నిర్వహించారు. పూళ్ల శాఖా గ్రంథాలయంలో గ్రంథ పాలకులు అమర్నాథ్ ఆధ్వర్యంలో గ్రంథాలయ ప్రాముఖ్యత గురించి వివరిస్తూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం దిశచట్టంపై వ్యాసరచన, విద్యార్థులకు మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించారు.
ఏలూరు :ఏలూరు బాలల గ్రంథాలయంలో ప్రముఖ లాయర్, ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం సెక్రటరీ గుడిపాటి నరసింహరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి రచయితలు, కవుల గురించి వివరించారు. రాజారామ్మోహన్రారు, కందుకూరి వీరేశలింగంతో పాటు పలువురు వారి రచనల ద్వారా సమాజంలో దురాచారాలను రూపుమాపడానికి చేసిన సేవల గురించి విద్యార్థులకు వివరించారు. ప్రతివిద్యార్థి మాతృభాషలో చదవడం, రాయడం తప్పక తెలుసుకోవాలని వారు సూచించారు. అనంతరం విద్యార్థులకు గ్రంథాలయంలో పుస్తకాల వర్గీకరణ గురించి తెలుపుతూ వారికి కావాల్సిన పుస్తకాలను ఎలా చూసుకోవాలో గ్రంథాలయ నిర్వాహకురాలు ఎం.శోభ తెలిపారు. విద్యార్థులకు వేమన, సుమతి శతక పద్యాల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పాఠకులు, గ్రంథాలయ సిబ్బంది ఎం.శోభ, ఎం.కీర్తి, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
ముదినేపల్లి : ముదినేపల్లి, గురజ శాఖ గ్రంథాలయాల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ముదినేపల్లి శాఖ గ్రంథాలయంలో స్వచ్ఛభారత్లో పౌరుల పాత్ర అంశంపై, గురజ శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాలు వాటి ప్రాముఖ్యత అంశంఫై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఇండో-సాక్షన్, లిటిల్ ఫ్లవర్, సహాయమాత, జెడ్పి హైస్కూల్ విద్యార్థులు 140 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జెడ్పి హైస్కూల్ హెచ్ఎం వై.విజరుకుమార్, గిరిధర్, సురేష్, లక్ష్మికుమారి, రేణుక, శివరంజని, ఆయా గ్రంథాలయాల అధికారులు ఎం.శ్రీదేవి, జి.జాన్సీలక్ష్మి పాల్గొన్నారు.