Nov 16,2023 21:55

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం గ్రంథాలయ ఉద్యమకారులను స్మరిస్తూ గ్రంధ పాలకుల సదస్సును కార్యదర్శి శర్మ ప్రారంభించారు. అలాగే ముఖ్యఅతిధిగా సుధాకర్‌రెడ్డి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న అయ్యంకి వెంకట రమణయ్య, రంగనాధం, పాతూరి నాగ భూషణం సేవలను కొనియాడారు. ఈసందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారములని, వ్యక్తి మేధస్సుకు మానసిక ఉల్లాసంకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. నిత్యజీవితంలో పుస్తక పఠనం దినచర్యగా చేసుకొసుకోవాలని విద్యార్థులకు ఉపదేశించారు. జిల్లా గ్రంథాలయ కార్యదర్శి శర్మ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సేవలను కొనియాడారు. విశ్రాంత ఉద్యోగులు జనార్ధన్‌, రవీంద్రారెడ్డి, సి.సుబ్రహ్మణ్యం, విజయకుమార్‌, వసంత కుమార్‌, గుణశేఖర్‌, బిలాల్‌, గజేంద్రబాబు, పూర్ణిమ, తులసీ కుమార్‌, దేవిబాల, సరస్వతి, శిరీష, లవకుమార్‌, ఎల్లమ్మ పాల్గొన్నారు.