Oct 25,2023 23:54

మాట్లాడుతున్న కస్పాండెంట్‌ విజయకుమారి

ప్రజాశక్తి -నర్సీపట్నంటౌన్‌:స్థానిక భవిష్య ప్రైవేటు పాఠశాలలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌, తెలుగుదేశం పార్టీ నాయకులు జాలుమూరి జోగారావు చేతులు మీదుగా ప్రారంభించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భవిష్య పాఠశాల కరస్పాండెంట్‌ విజయ కుమారి మాట్లాడుతూ, గాంధీ ఆచరించిన అహింస, శాంతి సిద్ధాంతాలతో స్వాతంత్య్రాన్ని సాధించారన్నారు. పాఠశాలలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పడంతో గాంధీజీ పేర్కొన్న ఆదర్శాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకున్నట్లవుతుందని తెలిపారు.