Nov 06,2023 22:36

చిత్తూరు అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ కోస్టల్‌ జోన్‌ మేనేజిమెంట్‌ సభ్యునిగా జడ్‌పి ఛైర్మన్‌ జి.శ్రీనివాసులును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ అథారిటీకి గుంటూరులో ప్రధాన కార్యాలయం ఉంది. కోస్టల్‌ జోన్‌ మేనేజిమెంట్‌ ప్లాన్‌ కింద వచ్చే ప్రాజెక్టులను పరిశీలించి, అనుమతుల కోసం సంబంధిత అధికారిక సంస్థలకు సిఫార్సు చేస్తారు. మంత్రి పెద్దిరెడ్డికి, ఎంపి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.