
ప్రజాశక్తి-మామిడికుదురు : అప్పనపల్లి బాల బాలాజీ శాశ్వత అన్నదాన నిదికి హైదరాబాద్ వాసులు దొమ్మేటి నరేంద్ర మోహన్ నాగలక్ష్మి దంపతులు వారి కుమారులు చి.మోక్షిత్ & గీతాన్ష్ వారి కుటుంబ సభ్యులు నరేంద్ర మోహన్ పుట్టిన రోజు ప్రతి సంవత్సరం నవంబర్ -20 వ తేదిన అన్నదానము జరిపించు నిమిత్తం (10,116/-) రూపాయలు బుధవారం విరాళంగా ఇచ్చారని ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారిణి జి.మాధవి ఆలయ ఛైర్మన్ చిట్టూరి రామకృష్ణలు తెలిపారు. ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టాల సత్తిబాబు, ఆలయ ఉప ప్రధాన అర్చకులు మద్దాలి తిరుమల శింగరాచార్యులు మరియు ఆలయ సిబ్బంది దాతకు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదంలు అందజేశారు.