
ప్రజాశక్తి-కనిగిరి: ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు, వైసిపి దుర్మార్గపు పాలనపై ప్రజా చైతన్యం కలిగించేందుకు మన ఊరు-మన ఉగ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కనిగిరి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాచవరం, కాశిరెడ్డి నగర్లలో మన ఊరు-మన ఉగ్ర కార్యక్రమం కొనసాగగా ఆయన పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ప్రజలను చైతన్య పరుస్తూ సాగారు. బాబుతో నేను కరపత్రాలు పంపిణీ చేస్తూ చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి ప్రజలకు వివరించారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మండల పార్టీ అధ్యక్షులు నంబుల వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు రాజమళ్ల శ్రీనివాసరెడ్డి, ముచ్చుమారి చెంచిరెడ్డి, వివిఆర్ మనోహర్రావు, షేక్ ఫిరోజ్, షేక్ అహ్మద్, తమ్మినేని వెంకటరెడ్డి, చింతలపూడి తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.