
ప్రజాశక్తి - ఆలమూరు : మండలంలోని లంక గ్రామాల ముఖ్య కేంద్రమైన చెముడులంక ప్రధాన కాలువ ఒడ్డున కొలువై ఉన్న చంటిబిడ్డల తల్లిగా పేరుగాంచిన శ్రీదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో సోమవారం దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ వరసిద్ధి వినాయక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ప్రొప్రైటర్ రాయుడు వెంకటేష్, సంధ్య దంపతుల ఆధ్వర్యంలో ప్రముఖ భవాని మాలధారులైన వైసిపి మండల కన్వీనర్, సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ పండు, చిరంజీవి తదితర భవానీలకు ఘన సత్కారం చేశారు. అలాగే అమ్మవారికి మ్రొక్కిన మ్రొక్కుబడులు పట్టు వస్త్రాలు, పానకం కావిడి వంటివి, సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ నాలుగేళ్ల క్రిందట అమ్మవారి ఆలయంలో సొంత ఖర్చులతో విగ్రహం ప్రతిష్టించడం జరిగిందన్నారు. అప్పటినుండి అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా భావించి కొలుస్తున్నట్లు నేత వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల వీర్రాజు, దొండపాటి చంటి, మోటూరి సురేష్, దొండపాటి శ్రీను, బి.వీర వెంకట్రావు, తమ్మన హరి, బొర్రా వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.