Nov 06,2023 00:38
అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తున్న టిడిపి శ్రేణులు

ప్రజాశక్తి-కనిగిరి: నందిగామ, పుంగనూరుల్లో దళితులపై జరిగిన దాడులను ఖండిస్తూ కనిగిరి నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశానుసారం పట్టణ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు బుల్లా బాలబాబు ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నిరసన తెలిపారు. దళితులపై దాడులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు షేక్‌ ఫిరోజ్‌, తమ్మినేని వెంకట్‌రెడ్డి, షేక్‌ అహ్మద్‌, వివి మనోహర్‌ రావు, చింతలపూడి తిరుపాలు, పాలూరి సత్యం, రిజ్వాన్‌, జాన్సన్‌, కరాటే మధు, ఆలీసు, మోజేసు, బ్రాక్‌, రూబేను తదితరులు పాల్గొన్నారు.