Nov 07,2023 23:18

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌
సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని కేసులను సత్వరంగా పరిస్కారించు కోవచ్చునని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌జడ్జి డాక్టర్‌ ఐ.కరుణ కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కోర్టు న్యాయసధన్‌ భవనంలో డిసెంబర్‌ 9న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని సత్వర సమన్యాయంతో జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసులను పరిస్కారించుకోవచ్చునని తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.బీమారావు ఆధ్వర్యంలో జిల్లాలో 2023 డిసెంబర్‌ 9న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో బీమా, మోటార్‌ వాహనాలు, చిట్‌ ఫండ్‌, చెక్‌ బౌన్స్‌ కేసులకు సంబంధించి సివిల్‌, క్రిమినల్‌ కేసులను పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు. జిల్లాలో నిర్వహించే లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించి రాష్టంలోనే చిత్తూరు జిల్లాను ముందంజలో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.