
ప్రజాశక్తి-అనకాపల్లి
దేశ సమైక్యత, సమగ్రత అందరి లక్ష్యం కావాలని జిల్లా ఎస్పి కెవి.మురళీకృష్ణ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభ్ భారు పటేల్ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవంలో భాగంగా పటేల్ చిత్రపటానికి ఎస్పీ మురళీకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రీయ ఏక్తా దివాస్ పరుగును రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడి, పోలీస్ అధికారులు, విద్యార్థులతో రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ అనేక రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్లో చేయడంలో సర్దార్ పటేల్ కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు బి.విజయభాస్కర్, పి.సత్యనారాయణరావు, డిఎస్పీలు వి.సుబ్బరాజు, మళ్ల మహేశ్వరరావు, పి.నాగేశ్వరరావు, అనకాపల్లి రూరల్ సర్కిల్ సిఐ రవికుమార్, అనకాపల్లి టౌన్ ఎస్సై సింహాచలం, ఏఆర్ ఎస్సై ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
దువ్వాడ విఎస్ఇజెడ్లో...
ఉక్కునగరం : దువ్వాడ విఎస్ఇజెడ్లో సర్దార్ వల్లభారు పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహించారు. ఐఆర్ఎస్ఎంఇ జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ శ్రీనివాస్ ముప్పాళ్ళ పాల్గొని, విఎస్ఇజెడ్ అధికారులు, కస్టమ్స్, సెక్యూరిటీ అధికారులతోపాటు స్థానికులతో తెలుగు, ఇంగ్లీష్లలో సమైక్యతా ప్రతిజ్ఞ చేయించారు. దేశ సమైక్యతకు సర్థార్వల్లభాయి పటేల్ సేవలను విఎస్ఇజెడ్ జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ రోషిణి అపరంజి కొరాఠి కొనియాడారు. స్థానిక సంస్కతి గ్లోబల్ పాఠశాల విద్యార్థులతో రన్ఫర్ యూనిటీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ ఆర్ఎ.ప్రవీణ్, కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ వరప్రసాద్ వర్మ పాల్గొన్నారు.
స్టీల్ప్లాంట్లో
ఉక్కునగరం: సర్దార్ వల్లభారు పటేల్ జయంతిని పురస్కరించుకొని ఉక్కు స్టేడియంలో స్టీల్ప్లాంట్ క్రీడలు, విజిలెన్స్ విభాగాలు సంయుక్తంగా ఏక్తా దివస్ రన్లో స్టీల్ప్లాంట్ సిఎండి అతుల్ భట్ పాల్గొన్నారు బెలూన్లను గాలిలోకి వదిలారు. ఉద్యోగులు. వివిధ పాఠశాలల విద్యార్థులతో ఉక్కు స్టేడియం నుంచి సెక్టార్-6 అంబేద్కర్ పార్క్ వరకు రన్ ఫర్ యూనిటీ వాక్లో పాల్గొన్నారు. చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఎస్ కరుణరాజు, ఉక్కు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ సంజరురారు, అధికారులు సమీనాథన,్ అజిత్ కుమార్ సక్సేన, డికె.మహంతి ఎస్సి పాండే పాల్గొన్నారు