
230 మంది విద్యార్థులకు బస్పాస్లు పంపిణీ
ప్రజాశక్తి - ఆగిరిపల్లి
దాతలు అందించిన సహాయాన్ని సద్వినియోగ పర్చుకోవాలని ఆగిరిపల్లి జెడ్పిహెచ్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.పుష్పలత తెలిపారు. ఆగిరిపల్లి జెడ్పిహెచ్ పాఠశాలకు దూరప్రాంతాల నుంచి వచ్చే 230 మంది విద్యార్థులకు స్థానిక ఎంఎల్ఎ మేకా వెంకటప్రతాప్ అప్పారావు వితరణగా అందజేసిన బస్సు పాస్లను వైసిపి జిల్లా కార్యదర్శి, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు మచ్చా హరిబాబు, టిజెఎస్ కుమారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు పి.నరశింహారావు, జెడ్పిటిసి పి.వీరబాబు, నాయకులు నాగుల్ మీరా, ఇస్సాక్, శ్రీమన్నారాయణ, రాంబాబు పాల్గొన్నారు.