Sep 27,2023 14:20
  • దళితుల భూములు దళితులకు ఇవ్వాలి
  • అన్యాక్రాంత భూముల్లో కెవిపిఎస్, సిపిఎం జెండాలు నాటీ భూములు స్వాదీనం చేసుకున్న దళితులు

ప్రజాశక్తి-లేపాక్షి : ఈరోజు లేపాక్షి మండలం కొండూరు రెవెన్యూ పొలంలో కొండూరు, కొర్లకుంట గ్రామాలకు చెందిన దళితులు మరియు బలహీన వర్గాల భూములను  అక్రమంగా దురాక్రమణ  చేసిన కుశలవ ప్రాజెక్టును తక్షణం రద్దు చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకొని మోసపోయిన దళితులకు తిరిగి భూములు అప్పగించాలని డిమాండ్ చేస్తూ స్థానికుడు గోపాల్ కృష్ణ ఆధ్వర్యంలో అన్యాక్రాంత భూముల్లో దళితులు కెవిపిఎస్ మరియు సిపిఎం పార్టీ జెండాలు నాటీ భూములు స్వాధీనం చేసుకోవడం జరిగింది.  ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ కుశలవ ప్రాజెక్ట్ ప్రతినిధులు దళితులను టార్గెట్ చేస్తూ పరిశ్రమలు పెట్టి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి మోస పూరిత మాటలు చెప్పి  అక్రమంగా  దౌర్జన్యంగా, దురాక్రమణ వందలాది ఎకరాలు భూమిని వందలాది దళిత కుటుంబాలను నిరాశ్రయులు చేశారు. మోసం చేసిన కుశలవ ప్రాజెక్ట్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని 2 సంవత్సరాలనుండి వివిధ రూపాల్లో విజ్ఞప్తులు, నిరసనలు చేసిన సంబంధిత రెవిన్యూ అధికారులు ఎటువంటి నిబంధనలు, చట్టాలను పాటించకుండా దళితుల భూములను ప్రభుత్వం స్వాదీనం చేసుకోవడం విడ్డురంగా ఉందని విమర్శించారు. మొత్తంగా అధికారులు, కుశలవ పెత్తందారులు కుమ్మక్కై దళితుల భూములు లాక్కున్నారు. కుశలవ ప్రాజెక్ట్ దళితుల భూములు మీద బ్యాంకు రుణాలు పొంది కోట్లాది రూపాయలు గడిస్తున్నారని ఆరోపించారు. 4 రోజులు తరువాత సదరి భూముల్లో విత్తనాలు వేసి సాగు చేస్తామని హెచ్చరించారు. తక్షణం అధికారులు నిబంధనలు ప్రకారం దురాక్రమణ అయిన భూములు దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు న్యాయం జరిగే వరకు కెవిపిఎస్ , వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ, కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు నారాయణ, రాయుడు,  మంజు, స్థానికులు గోపాలకృష్ణ మరియు దళితులు నరసింహాప్ప,  గంగాధర్, మల్లిఖార్జున, రామలక్ష్మమ్మ, నాగమ్మ, ముద్దమ్మ తదితరులు పాల్గొన్నారు