
ప్రజాశక్తి-మండపేట : ఉప సర్పంచ్ గా అర్తమూరు గ్రామ అభివృద్ధికి కర్రి కనకసుందరరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరావు అన్నారు. శనివారం అర్తమూరు గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ కనకసుందరరెడ్డి సంతాప సభ గ్రామంలోని పెద్దనూతి సెంటర్ వద్ద జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్యే వేగుళ్ల హాజరై కనకసుందరరెడ్డి సేవలను గుర్తుచేసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ మాజీ మెంబర్ పడాల సుబ్బారెడ్డి మాట్లాడుతూ కనకసుందరరెడ్డి మృతి గ్రామానికి తీరని లోటన్నారు. గ్రామ ఉప సర్పంచ్ కర్రి సత్యనారాయణ రెడ్డి (జంబయ్య) మాట్లాడుతూ వివాదరహితునిగా కనకసుందరరెడ్డి గ్రామంలో మంచి గుర్తింపు పొందరన్నారు. సొసైటీ మాజీ చైర్మన్ పడాల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కనకసుందరరెడ్డి మృతి టీడీపీకి తీరని లోటన్నారు. వీర్రెడ్డి మాట్లాడుతూ కనకసుందరరెడ్డితో గల అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తాను సర్పంచ్ గా ఉన్న సమయంలో ఉప సర్పంచ్ గా కనకసుందరరెడ్డి గ్రామ అభివృద్ధికి ఎనలేని సహకారం అందించారని తెలిపారు. తొలుత కనకసుందరరెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే వేగుళ్ల, వీర్రెడ్డి, సుబ్బారెడ్డి, జంబయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపి నాయకులు చిర్ల వెంకటరెడ్డి, చిర్ల బాబులురెడ్డి, నల్లమిల్లి శ్రీహరి రెడ్డి, గుడిమెట్ల ఆదినారాయణ రెడ్డి, కాకర శ్రీనివాసరావు, కర్రి గోపిరెడ్డి, చెల్లారెడ్డి, కర్రి భద్రారెడ్డి, దమ్ము రమణ తదితరులు పాల్గొన్నారు.