
ప్రజాశక్తి - ద్వారకాతిరుమల
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాణదాన ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్న ఉచిత ప్రథమ చికిత్స కేంద్రానికి ఉచిత మందులను గురువారం అందించారు. నడకదారి వచ్చే భక్తుల కోసం సుమారు రూ.పది వేల విలువైన ఉచిత మందులను విజయవాడ వాస్తవ్యులు భాస్కర్ మెడికల్ ఏజెన్సీ అధినేత సురేష్ సహాయ సహకారాలతో విజయవాడకు చెందిన దాతలు తాత వెంకటసుబ్రహ్మణ్యం, విఎస్డి మెడికల్ ఏజెన్సీ విజయవాడ వారు ద్వారకా తిరుమల దేవస్థానం ఎఇఒ లక్ష్మణస్వామి చేతులమీదుగా ఈ మందులు అందించారు. వారికి దేవస్థానం తరపున జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాధరావు ఆదేశాల మేరకు ప్రాథమిక చికిత్స కేంద్రం వైద్యులు రాజేంద్రప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. వారికి స్వామి వారి దివ్య దర్శనం ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్ ఎఎన్ఎం చిన్నారి పాల్గొన్నారు.