
చిన్నారితో డాక్టర్ సునీల్ కిషోర్
ప్రజాశక్తి-ఒంగోలు : కనిగిరికి చెందిన ఐదేళ్లుపాప ప్రమాదవశాత్తు బంగారం కరిగించే ద్రావణంలో (యాసిడ్)లో పడిపోయింది. దీంతో ఆ పాపకు సుమారు 40 శాతం మేర కాలిన గాలయ్యాయి. తల్లిదండ్రులు ఒంగోలులోని ఉషా సూపర్స్పెష్పాలిటీ హాస్పిటల్కు తీసుకొచ్చారు. డాక్టర్ ఎందేటి సునీల్ కిషోర్ ప్రత్యేకమైన శ్రద్ధ వహించి స్కిన్ గ్రాఫ్టింగ్ అనే ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ చేసి పాపకు పున్ణజన్మ ప్రసాదించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం కుదుట పడింది. ఈ సందర్భంగా పాప తల్లిదండ్రులు డాక్టర్ సునీల్ కిషోర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ కిషోర్ మాట్లాడుతూ తమ హాస్పిటల్లో కాలిన గాయాల వారికి అన్ని సదుపాయాలతో ప్రత్యేకమైన చికిత్స అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.