
ఇరిగేషన్ ఎస్ఈ విజరు కుమార్ రెడ్డి
ప్రజాశక్తి- బంగారుపాళ్యం: చెరువులో మట్టిని తీరాదని ఇరిగేషన్ ఎస్ఈ విజరు కుమార్ రెడ్డి హెచ్చరించారు. గురువారం మండలంలోని గుంతూరు పంచాయతీ పరిధిలోని వరదప్ప నాయుని చెరువులో హైవే కాంట్రాక్టర్ అయిన దిలీప్ కన్స్ట్రక్షన్ నిబంధనలకు విరుద్ధంగా మట్టి తియ్యడాన్ని ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. ఇక్కడ మట్టి తియ్యరాదని అలా తీస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెంటనే చెరువులో ఉన్న మట్టి తీసే వాహనాలను అక్కడ నుండి పంపి వేయడం జరిగిందన్నారు. దిలీప్తో ఫోన్లో మాట్లాడుతూ ఇక్కడ కట్టకు వంద మీటర్ల అవతల మట్టి తీయ్యమని మీకు అనుమతులు ఇస్తే కట్టను కూడా తొలగిస్తూ మట్టి తియ్యరాదని నిబంధనలకు వ్యతిరేకంగా మట్టి తొలగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ నరసింహ ప్రసాద్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.