
ప్రజాశక్తి-చౌడేపల్లి: ఉర్దూ మీడియంలో ఉత్తమ ఫలాతాలను సాధించిన చౌడేపల్లి పాఠశాల విద్యారిని ఉత్తమ అవార్డును అందుకుంది. మండలంలోని దుర్గ సముద్రం పంచాయతీ దాదేపల్లి ఉర్దూ పాఠశాలకు చెందిన హలీమా సాదియా పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించింది. దీంతో రాష్ట్ర ఉర్దూ అకాడమీ బెస్ట్ స్టూడెంట్ అవార్డుకు హలీమా సాదియాను ఎంపిక చేసింది. శనివారం విజయవాడల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డిప్యూటి సిఎం అంజాద్ బాషా చేతుల మీదుగా అవార్డు అందుకునింది. హలీమా తండ్రి స్థానికంగా సైకిల్ మెకానిక్ దుకాణం నిర్వహిస్తూ చదివించాడు. నిరుపేద ఇంట ఉత్తమ అవార్డు అందుకున్న విద్యార్థినిని పలువురు అభినందించారు.