Nov 13,2023 21:03

ఎస్‌ఐ పవన్‌ కుమార్‌
ప్రజాశక్తి - పోలవరం
   కార్తీకమాసం మొదలైన సందర్భంగా గోదావరి నది తీరాన స్నానాలు ఆచరించే భక్తులు, ప్రజలు అధికారులు ఏర్పాటు చేసిన స్నాన ఘాట్ల వద్ద స్నానాలు ఆచరించాలని పోల వరం ఎస్‌ఐ పవన్‌ కుమార్‌ సూచించారు. కార్తీకమాసం సం దర్భంగా మం డలంలోని పట్టిసీమ రేవు, గోదావరి నది తీరాన ప్రమాదకరంగా ఉన్న రేవులు వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి నది తీరాన స్నాన మాచరించే భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు ఏర్పాటు చేసిన రేవుల వద్దే స్నానం ఆచరించాలని, ప్రమాదకరంగా ఉన్న అనధికార రేవుల వద్ద స్నానాలు చేసేందుకు దిగవద్దని సూచించారు. పట్టిసీమ శివ క్షేత్రానికి వెళ్లే భక్తులు నది దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భక్తులు నది దాటే సమయంలో ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఫెర్రీ కాంట్రాక్టర్‌ రాంబాబుకు సూచించారు.