
సిఐ బాల సురేష్, యం.ఎస్ కుటుంబరావు
ప్రజాశక్తి - ముసునూరు
దీపావళి పండుగ పురస్కరించుకుని భద్రతా ప్రమాణాలు దృష్టిలో ఉంచుకుని పండుగును కుటుంబసభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని నూజివీడు సిఐ బాల సురేష్, ఎస్ఐ యం.కుటంబరావులు తెలిపారు. శనివారం మండలకేంద్రమైన ముసునూరు పోలీస్స్టేషన్లో వారు ప్రజాశక్తితో మాట్లాడుతూ దీపావళి టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, మండలంలో టపాసులు ఎక్కడైనా అక్రమంగా విక్రయిస్తున్నా, నిల్వ ఉంచినా డయల్ 100కి, లేదా ముసునూరు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనుమతులు లేకుండా టపాసులు దొంగతనంగా విక్రయించరాదన్నారు. ప్రభుత్వం అనుమతులు తీసుకున్న విక్రయదారులు చట్ట నిబంధనలు పాటిస్తూ, ఊరికి దూరంగా ప్రమాదం లేని పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు జరపాలన్నారు. ఇసుక, నీరు తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పని సరిగా టపాసుల విక్రమ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. చిన్న పిల్లలను అమ్మకాల షాపుల్లో పెట్టుకోరాదని, పైన తెలిపిన వివరాలను పాటిస్తూ దీపావళి పండుగును జరుపుకోవాలని తెలిపారు. అనంతరం మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
భీమడోలు : భీమడోలు సర్కిల్ పరిధిలోని ప్రజలకు ఇన్సెపెక్టర్ భీమేశ్వర రవి కుమార్ శనివారం దీపావళి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు భద్రతా నియమాలు పాటిస్తూ, ఆహ్లాదకర వాతావరణంలో ఆనందోత్సవాల మధ్య పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. బాణాసంచా కొనుగోళ్ల సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇదే క్రమంలో బాణాసంచా విక్రేతలు అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచడం, అమ్మడం చేయరాదన్నారు.