
- దేశభక్తి పేరుతో దేశద్రోహం పనులు
- మోడీ కార్పోరేట్ విధానాలను ప్రతిఘటించండి
- బెఫి రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులుగా వేణుగోపాల్, అజయ్ కుమార్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలో ఉద్యోగ, కార్మిక ఉద్యమాలకు క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని, హక్కులను పరిరక్షించుకునేందుకు ఉద్యోగం ఉద్యమం అనే నినాదంతో బ్యాంక్ ఉద్యోగులు ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎ గఫూర్ పిలుపునిచ్చారు. దేశంలో ఈ తొమ్మిదేళ్ల కాలంలో నరేంద్రమోడి ప్రభుత్వం సామాన్య ప్రజలను పణంగా పెట్టి కార్పొరేట్ శక్తులకుదేశానిు దోచిపెడుతోందని ఇదేమిటని ప్రశిుస్తే దేశద్రోహులు అనే ముద్ర వేస్తున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం దేశభక్తి పేరుతో దేశద్రోహం పనులు చేస్తోందనిఅనాురు. శనివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బెఫి) 8వ రాష్ట్ర మహాసభ జరిగింది. ఈ మహాసభలో ఎంఎ గఫూర్ ప్రారంభోపన్యాసం చేశారు. స్వాతంత్య్రం అనంతరం దేశం కార్పొరేట్ల మీద ఆధారపడకూడదని బలమైన ప్రభుత్వరంగాన్ని నిర్మించుకుంటే మోడి ప్రభుత్వం వచ్చాక నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ప్రజల త్యాగాలతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేట్ పరం చేయడం, అలా సాద్యం కాకపోతే అమ్మివేస్తామని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వరంగంలోని పారిశ్రామిక, ఫైనాన్సియల్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం పూర్తి సంక్షోభంలోకి నెట్టేస్తోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా మెరుగైన సేవలను అందిస్తున్న జాతీయ బ్యాంక్లను కేంద్రం సంస్కరణల పేరుతో నిర్వీర్యం చేస్తోందనివిమర్శించారు. దేశంలో ఇప్పటికే విమానయానం, ఎయిర్పోర్టులు, పోర్టులు, బగ్గుగనులను ప్రైవేటీకరించారని ఇపుడు బ్యాంకింగ్ రంగంపై దృష్టి సారించారని అనాురు. బలమైన ఉద్యోగ, కార్మిక ఉద్యమాలు రాకుండా లేబర్ కోడ్ల పేరుతో ఉద్యోగులకువును హక్కులను మోడి ప్రభుత్వం తొలగించిందనితెలిపారు. బ్యాంక్ ఉద్యోగులు ప్రజల మద్దతును కూడగట్టి బ్యాంకింగ్ రంగానిు పరిరక్షించుకోవాలనిపిలుపునిచ్చారు. ఈ సందర్బంగా బెఫి జాతీయ ప్రధాన కార్యదర్శి దేబశిష్ బసు చౌదురి మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా 2007,2008 తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో దాదాపు అనిు దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతోపాటు, పెద్దపెద్ద బ్యాంకులు మూతపడ్డా దేశంలోనిబ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగం ప్రభుత్వ రంగంలో వుండటంతో ఆర్థిక సంక్షోభం దేశానిు తాకలేక పోయిందనిగుర్తు చేశారు. అలాంటి బలమైన బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకుందనాురు. దేశంలో బ్యాంకింగ్ రంగానికి వందేళ్ల చరిత్ర వుందని తెలిపారు. 1935నుండి 1969 వరకుబ్యాంకులనీు దివాళా తీసి ప్రజల డిపాజిట్లకు రక్షణలేని పరిస్థితి వుండేదనాురు. 1969 తర్వాత బ్యాంకులను జాతీయం చేశాక సేవలు క్షేత్రస్థాయిలోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాయని తెలిపారు. బలమైన బ్యాంకింగ్ రంగానిు బిఎస్ఎన్ఎల్ తరహాలో నిర్వీర్యం చేసేందుకుమోడి ప్రభుత్వం కుట్రలు చేస్తోందనివిమర్శించారు. బ్యాంక్ ఉద్యోగులు మరింత సంఘటితంగా బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలనికోరారు. బెఫి రాష్ట్ర అధ్యక్షులు బి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభ ప్రారంభసభలో రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోషియేషన్ నాయకులు బిక్షమయ్య, ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సౌత్ జోన్ సహాయ కార్యదర్శి జి కిశోర్కుమార్, బెఫి తెలంగాణా నాయకులు సతీష్, నాయకులు అజయ్ కుమార్, కె సత్యరంజన్, ఎస్వి రమణ తదితరులు పాల్గనాురు.

- బెఫి రాష్ట్ర కమిటికి నూతన కమిటి ఎన్నిక
విజయవాడలో జరిగిన బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బెఫి) 8వ రాష్ట్ర మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటి ఎన్నికైంది. బెఫి రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులుగా వేణుగోపాల్, అజయ్ కుమార్, కోశాధికారిగా ఎస్ రంగారావు, డిప్యూటి జనరల్ సెక్రటరీలుగా కె సత్యరంజన్, ఎస్ఎన్ మూర్తి, ఉపాధ్యక్షులుగా ఎంవిఎస్ ప్రసాద్, శరత్ చంద్ర శ్రీనివాస్, కె హరికృష్ణ, ఎం క్రాంతి, కె సత్యనారాయణ, అసిస్టెంట్ సెక్రటరీలుగా అప్పలరెడ్డి, విఎన్ రాజారెడ్డి, అనూప్ శ్రీరామ్, ఎస్వి రమణలతో ఈ మహాసభలలో నూతన రాష్ట్రకమిటి ఎనిుకైంది.