
బీసీ కార్పొరేషన్ ఈడీగా శ్రీదేవి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్
బీసీ కార్పొరేషన్ ఈడీగా శ్రీదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జీడి నెల్లూరు ఎంపీడీవోగా పనిచేసిన శ్రీదేవి ఉద్యోగోన్నతిపై బీసీ కార్పొరేషన్ ఈడీగా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ను కలిసి కతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ పరిధిలో అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు బ్యాంకు రుణాలు అందించేందుకు కషి చేయనున్నట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ను మర్యాదపూర్వకంగా కలసిన శ్రీదేవి జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీగా బాధ్యతలు స్వీకరించారు.