
బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులకు అభినందన
బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులకు అభినందన
ప్రజాశక్తి- నగరి: మండలంలోని తడుకుపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాల సమీపంలోనే ఉన్నా జాతీయ రహదారిని దాటుకొని విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు విన్నవించుకున్నారు. దీంతో సిఐ సురేష్ ఈ ప్రాంతంలో రెండు బారికేడ్లను ఏర్పాటుచేసి వేగంగా వచ్చే వాహనాలు ఈ ప్రాంతంలో నెమ్మదిగా వెళ్లేలా ఏర్పాటుచేశారు. దీంతో వైస్ ఎంపీపీ కన్నియప్ప, విద్యార్థులు సీఐని పూలదండలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎస్ఐ రాజాకుల్లాయప్ప పాల్గొన్నారు.