
ప్రజాశక్తి- యర్రగొండపాలెం : మండల పరిధిలోని కాశికుంట, మెట్టబోడు, పిల్లికుంట తాండాలలో గురువారం టిడిపి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్బాబు ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చాక అమలు చేసే పథకాల గురించి ప్రజలకు వివరించారు. సంక్షేమంలో కోతలు విధించి పేద ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. షెడ్యూల్ తెగల చట్టం కింద ఐటిడిఎ నిధుల కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని అసమర్ధ వైసిపి ప్రభుత్వం అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పరిశీలకులు వేములకొండ శ్రీనివాస్, టిడిపి మండల కన్వీనర్ చేకూరి సుబ్బారావు, కాశికుంట సర్పంచి మంత్రూ నాయక్, నాయకులు చిట్టేల వెంగళరెడ్డి, తోటా మహేష్రెడ్డి, సంజీవరెడ్డి, బాలు నాయక్, పాలడుగు వెంకట కోటయ్య, రామావత్ వెంకటేశ్వర్లు నాయక్, రెడ్డే నాయక్, కాశీ నాయక్, బాలు నాయక్, శ్రీను నాయక్ పాల్గొన్నారు. పెద్దదోర్నాల : మండల పరిధిలోని చింతల ఆగ్రహారంలో బాబు ష్యూరిటీ, భవిషత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక అమలు చేసే పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి ఒంగోలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఈదర మల్లయ్య, టిడిపి గ్రామ అధ్యక్షుడు చిట్యాల వెంకటేశ్వరరెడ్డి, నాయకులు చిట్యాల శ్రీను, పసుపుల సుబ్బయ్య, దూదేకుల కాశయ్య, ఎనిబెర సాంసన్, బి.ఆనందరావు, నల్లబోతుల ఆదినారాయణ పాల్గొన్నారు. మార్కాపురం : వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనను ఆశీర్వదించాలని... ఆ తరువాత మీ రుణం తీర్చుకుంటానని టిడిపి మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరారు. మార్కాపురం మున్సిపాలిటీలోని 31వ వార్డులో బాబుష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి వార్డు ప్రజలతో కలిసి మాట్లాడారు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందని, మార్కాపురం నియోజకవర్గ నుంచి తనను ఆదరించాలని కోరారు. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేసే పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు కౌన్సిలర్ నాలి కొండయ్య, టిడిపి నాయకుడు పఠాన్ ఇబ్రహీంఖాన్, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. .దర్శి :చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే ప్రజలందరికీ భద్రత ఉంటుందని టిడిపి నియోజకవర్గ పరిశీలకుడు నాదెండ్ల బ్రహ్మంచౌదరి తెలిపారు. మండల పరిధిలోని రాజంపల్లి గ్రామంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని టిడిపి మండల అధ్యక్షుడు చిట్టే వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మంచౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. చంద్రబాబును జైలులో పెట్టడం అన్యాయమన్నారు. అనంతరం ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాకా అమలు చేసే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ముండ్లమూరు మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, టిడిపి పార్లమెంటు ఉపాధ్యక్షుడు మారెళ్ళ వెంకటేశ్వర్లు, తెలుగు మహిళ అధికార ప్రతినిధి శోభారాణి, గ్రామ నాయకులు దామా కృష్ణ, వెంకట రామయ్య, కోటేశ్వరరావు, దామా శ్రీను, వెలుగొండారెడ్డి, క్లష్టర్ ఇన్ఛార్జి రామారావు, సందు రామయ్య, బేళ్ళ శ్రీను తదితరులు పాల్గొన్నారు.