Nov 04,2023 22:42

ప్రజాశక్తి-పెద్దపంజాణి: విద్యార్థులకు అర్థ మయ్యేలా విద్యను బోధిం చాలని జెడ్పి సీఈవో ప్రభాకర్‌ రెడ్డి ఉపా ధ్యాయు లకు సూచించా రు. మండలంలోని రాయ లపేట ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. రికా ర్డులు పరిశీలించారు. అనంతరం తరగతి గదిలో విద్యా ర్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పాఠశాల వంటగది, మరుగుదొడ్లును ఆయన పరిశీలించారు. మరుగుదొడ్లు నుంచి మురుగునీరు వెల్లేం దుకు డ్రైనేజీ ఏర్పాటు చేయించాలని స్థానిక పంచాయతీ కార్య దర్శి గణపతిని ఆదేశించారు. అనంతరం నాడు-నేడు పను లను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఎంపిడివో అబ్దుల్‌ రహీం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.