
ప్రజాశక్తి-పుల్లలచెరువు
మార్కాపురం ఆర్టీసీ బస్సుల సౌకర్యం పుల్లలచెరువులో కల్పించాలని పులలచెరువు ప్రజలు కోరుతున్నారు. గతంలో మార్కాపురంలో ఉదయం 9 గంటలకు బయలుదేరి రావులాపురం వచ్చేసరికి ఒంటిగంట అవుతుంది. మరలా రావులాపురం నుంచి మార్కాపురం ఐదు గంటల 30 నిమిషాలకి చేరుతుంది. సాయంత్రం 6:40 నిమిషాలకు మార్కాపురంలో రావులాపురం బస్సు బయలుదేరి రావులాపురం చేరే వరకు 10:30 నిమిషాలు అవుతుంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో పని ముగించుకొని ప్రయాణికులు మార్కాపురం వచ్చి రావులాపురం బస్సు ఎక్కి, యర్రగొండపాలెం, మురారిపల్లి, కవలకుంట్ల, పుల్లలచెరువు, ముట్టుకుల, మర్రివేముల మీదిగా రావులాపురం చేరుతుంది. ఈ గ్రామాల ప్రజలు ఆ బస్సు ఎక్కి వారి గమ్యస్థానానికి చేరుకుంటారు. ఈ బస్సు తీసేయడం వలన ఆయా గ్రామాల ప్రజలు సాయంత్రం వేళ ఒంగోలు నుంచి వచ్చిన వారు. యర్రగొండపాలెంలో రాత్రి గడపాలిసిందే. ఒంగోలు నుంచి వినుకొండ వచ్చిన వారు. వినుకొండలో రాత్రి గడపాల్సిందే. గతంలో ఒంగోలు ఆర్టీసీ బస్సు పుల్లలచెరువు నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాలకు బస్ సర్వీసు వేసినారు. అదే బస్సు ఒంగోలులో సాయంత్రం మూడు గంటలకు పుల్లలచెరువు బయలుదేరుటకు సిద్ధంగా ఉంటుంది. జిల్లా కేంద్రంలో త్వరగా పనులు ముగించుకొని ఆ బస్సుని ఆశ్రయించి పుల్లలచెరువు మండలంలోని ప్రజలు తమ గమ్యస్థానానికి చేరుకుంటారు. రాను రాను ఆ బస్సు సర్వీసు తొలగించినారు. తర్వాత ఈ మధ్యకాలంలో మార్కాపురం నుంచి రావులాపురం బస్ సర్వీసును తొలగించడం జరిగినది. ఈ రెండు బస్సులు యాద ప్రకారం బస్ సర్వీసులు పున: ప్రారంభించాలని పుల్లలచెరువు మండల ప్రజలు కోరుతున్నారు.