Nov 05,2023 01:06
పిచ్చిచెట్ల మధ్యన ఉన్న ఆర్‌బికె

ప్రజాశక్తి-పామూరు: రైతు భరోసా కేంద్రానికి భరోసా లేకుండాపోయింది. కార్యాలయాన్ని పిచ్చిచెట్లు చుట్టేశాయి. కార్యాలయం చుట్టూ చిల్లచెట్లు పెరిగి ఆటంకంగా ఉన్నా అధికారులకు పట్టడంలేదు. పామూరు పట్టణంలోని ఎంపిడిఒ కార్యాలయంలో వెనుక ఆర్‌బికే కార్యాలయాన్ని నిర్మించారు. ఆ భవనంలో నిరంతరం అధికారులు ఉండే కార్యాలయం ఎదుట పిచ్చిచెట్లు అల్లుకుపోయి ఉన్నాయి. రైతులు అధికారుల వద్దకు వెళ్లాలంటే ఆఫీసు ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి ఉన్నదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులకు నిరంతరం రైతులతో సంబంధాలు ఉన్న ఆఫీసులో ఏం జరుగుతుందో అంతుపట్టడం లేదు. సచివాలయాలు వచ్చిన తర్వాత ఏ అధికారి ఎక్కడ ఉంటున్నాడు ఏ ఆఫీసులో ఉంటున్నారు ప్రజలకు అర్థంకాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి ఆర్‌బికె భవనం చుట్టూ ఉన్న పిచ్చిచెట్లను తొలగించి ప్రజలకు అనుకూలంగా ఉండేలా తయారు చేయాలని మండల రైతులు, ప్రజలు కోరుతున్నారు.