
ప్రజాశక్తి - యాదమరి
కాంట్రాక్టర్ వద్ద భారీ స్థాయిలో ముడుపులు తీసుకుని అంతర్ రాష్ట్ర రహదారి మరమ్మతు పనుల పర్యవేక్షణ గాలికి వదిలేసారని సభ్యులు ఆర్ అండ్ బి ఏఈ ఆది కేశవులుపై ధ్వజమెత్తారు. సోమవారం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జడ్పీ వైస్ చైర్మన్ బి.ధనుంజయ రెడ్డి హాజరయ్యారు . ఈ సందర్భంగా తెల్ల రాళ్లపల్లి గ్రామ సర్పంచ్ భజలింగం మాట్లాడుతూ చిత్తూరు గుడియాత్తం అంతర్రాష్ట్ర రోడ్డు మరమ్మతుకు ప్రభుత్వం 45 లక్షల రూపాయలు నిధులు కేటాయిస్తే జోడి చింతల నుండి కాశిరాల వరకే మరమ్మతులు చేశారన్నారు. చేసిన మరమ్మత్తులు నాశిరకంగా ఉండడంతో వేసిన పది రోజులకే మరలా గుంతల మయం అయ్యిందని సభ దష్టికి తీసుకొచ్చారు. తమిళనాడు సరిహద్దు కనికాపురం వరకు రోడ్లల్లో ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పెద్ద పెద్ద గోతులుగా ఏర్పడి ప్రమాదాల బారిన పడుతున్నామని ఈ పనులు కూడా వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారుల దష్టికి తీసుకెళ్లారు. ఆర్ అండ్ బి ఏ ఈ ఆది కేశవులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి మంజూరైన 45 లక్షల నిధులు రోడ్డు వేసేసామని, మిగిలిన రోడ్డు వేయాలంటే ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే వేస్తామని సభ్యుల దష్టికి తీసుకెళ్లారు. రోడ్డు పూర్తిస్థాయిలో వేసేందుకు 6.5 కోట్ల తో అంచనాలు తయారు చేసి కలెక్టర్ దష్టికి నిధులు మంజూరైన వెంటనే పనులు చేపట్టేందుకు టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఆర్ అండ్ బి అధికారులు కాంట్రాక్టర్ దగ్గర మామూళ్లు తీసుకొని నాసిరకంగా పనులు చేపట్టడం వల్లే వేసిన నెల రోజులకే రోడ్లు మరలా గుంతలమయమయ్యిందన్నారు. కాశి రాళ్ల, కొత్తూరు వద్ద బ్రిడ్జి మరమ్మతులు గురయ్యిందని, మరమ్మతులు చేపట్టాలని కాశి రాళ్ల ఎంపిటిసి దుర్వాసులు అధికారులు దష్టికి తీసుకెళ్లారు. లేకుంటే బ్రిడ్జ్ కూలిపోయే పరిస్థితి నెలకొంటుందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. పంచాయతీరాజ్ ఏ ఈ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గడపగడపకు ప్రోగ్రాం లో మంజూరైన పనులు వెంటనే చేపట్టాలని, లేకుంటే ఆ నిధులు వెనక్కి వెళ్లిపోతాయని ప్రజా ప్రతినిధుల దష్టికి తీసుకెళ్లారు. మండల పరిధిలోని సచివాలయాలు భవనాలు, హెల్త్ క్లినిక్లు, ఆర్ బి కే రైతు భరోసా కేంద్రాలు, రెండు నెలల్లో పూర్తి చేయాలని కోరారు. ఎంపీడీవో శివరాజ్ మాట్లాడుతూ జగనన్న హౌసింగ్ కాలనీలో ఇంకా నిర్మాణాలు ప్రారంభించకుంటే అలాంటి లేఔట్లను గుర్తించి వారి పట్టాలను రద్దుచేసి వేరొకరికి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ చైర్మన్ హరి నారాయణ రెడ్డి రవీంద్ర, తాసిల్దార్ హనుమంతు, ఎంపీడీవో శివరాజ్, యాదమరి ఎస్సై సుమన్ పాల్గొన్నారు.