
ప్రజాశక్తి-బంగారుపాళ్యం: మండలంలోని కోదలమడుగు గ్రామంలో ఆదివారం నరకచతుర్దశి సందర్భంగా గ్రామస్తులు ఎడ్ల పందెం నిర్వహించారు. ఎడ్లను సుందరంగా అలంకరించి పరుగు పందాలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతలు అందజేశారు. యువకుల ఆనందోత్సాహాల నడుమ పందెం పలువురిని ఆకట్టుకునింది.