Nov 11,2023 21:19

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ సేవలు మరువలేనివని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల అమలు కమిటీ జిల్లా సభ్యులు యం. అఫ్జల్‌ఖాన్‌ అన్నారు. భారతరత్న మౌలా నా అబుల్‌కలాం ఆజాద్‌ 135వ జయంతిని పురస్కరించుకొని మైనార్టీ సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో జాతీయ మైనార్టీ సంక్షేమ దినోత్సవం కలెక్టర్‌ కార్యాల యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఆజాద్‌ చిత్రపటానికి పూలమా లలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యా యు లకు సన్మానాలు నిర్వహించారు. సన్మానం చేసుకున్న వారిలో పిసిర్‌ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌ అబ్దుల్‌ మజీద్‌, కన్నన్‌ ప్రిన్సిపాల్‌ సయ్యద్‌, జై హింద్‌ స్కూ ల్‌ హెడ్మాస్టర్‌ ముక్తియర్‌లు ఉన్నారు. కార్యక్రమంలో జామియా మసీద్‌ కార్య దర్శి ఫాహిం బాషా, ప్రభుత్వ ఖాజీ అబ్దుల్‌ మాలిక్‌, కార్పొరేటర్‌ అల్తాఫ్‌, ముస్లిం నాయకులు రహమాన్‌, విద్యార్థులు పెద్ద సంఖ్యల హాజరయ్యారు.