Nov 05,2023 22:26

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని విద్యార్థి, వామపక్ష సంఘాలు ఈ నెల 8న విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, పిడిఎస్‌యు, తెలుగునాడు, భగత్‌సింగ్‌ స్టూడెంట్స్‌ సంఘాల ప్రతినిధులు ఆదివారం పోస్టర్‌ ఆవిష్కరించారు. బంద్‌ను విజయవంతం చేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు, కళాశాల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వల్ల సుమారు యాబై నుంచి రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందన్నారు. పరిశ్రమను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే అంతా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ఐక్యతతో బంద్‌ను విజయవంతం చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విద్యార్థి సంఘ నేతలు ప్రభుతేజ, గూగుల్‌ఆదిత్య, జగన్‌, చలపతి, ప్రవీణ్‌ కుమార్‌, సురి, ప్రేమ్‌ చంద్‌, చైతన్య, తరుణ్‌, వినరు, కుల్దీప్‌, ముని, దుర్గ పాల్గొన్నారు.