
ప్రజాశక్తి - ముదినేపల్లి
అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబానికి సోమవారం దాతలు సాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే ముదినేపల్లి పంచాయతీ శివారు అన్నవరంకు చెందిన ఈడే నాంచారమ్మకు చెందిన తాటాకు ఇల్లు ఆదివారం విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా కాలి బూడిదయ్యింది. ఈఘటనలో ఇంటిలోని వస్తువులు అన్నీ అగ్నికి ఆహుతైయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న ముదినేపల్లి రెడ్క్రాస్ సభ్యులు, విజయలక్ష్మీ ట్రాన్స్పోర్టు యాజమాన్యం బాధితురాలు నాంచారమ్మను పరామర్శించి రూ.5 వేలు నగదు, వంట సామాగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో వై.ఆకీనీడు, వెలివెల గోపీనాధ్, అల్లాడి సతీష్, దూలం కుమార్, తదితరులు పాల్గొన్నారు.