
ప్రజాశక్తి-మండపేట : స్థానిక మారేడుబాక వంతెన సమీపంలో ఇందిరాగాంధీ బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద ఆక్రమణను మున్సిపల్ అధికారులు ఎట్టకేలకు తొలగించారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ హోటల్ నిర్వాహకులు కొంత రోడ్డు భాగాన్ని ఆక్రమించడమే కాకుండా డేరాలు కట్టి రోడ్డు కనిపించకుండా చేశారు. ఇటీవల ఇందిరాగాంధీ బైపాస్ రోడ్డు వెడల్పు చేసి సిమెంటు రోడ్డుగా నిర్మాణం జరగడంతో భారీ వాహనాలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో కెపిరోడ్డు నుంచి ఇందిరా గాంధీ బైపాస్ రోడ్డులోకి వెళ్లే వాహనాలు రహదారి కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు గతంలో ప్రజాశక్తి దినపత్రికలో వచ్చిన వార్తకు అధికారులు స్పందించిన తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.