Nov 11,2023 17:45

ఘనంగా జయంతి వేడుకలు
ప్రజాశక్తి - ఏలూరు
   మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి యం.వెంకటేశ్వర్లు సూచించారు. స్వతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆజాద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అబ్దుల్‌ కలాం ఆజాద్‌ విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. మైనారిటీ విద్యా, వెనుకబడిన వర్గాల వారీ విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. వారు విద్యారంగంలో తీసుకువచ్చిన మార్పులు భవిష్యత్‌ తరాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. అబ్దుల్‌ కలాంను స్ఫూర్తిగా తీసుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి ఎన్‌ఎస్‌.కృపావరం, కలెక్టరేట్‌ ఎఒ ఎస్‌.రమాదేవి, కలెక్టరేట్‌ వివిధ విభాగాల సూపరింటెండెంట్లు చల్లన్న దొర, యండి షా పాల్గొన్నారు.
చాట్రాయి : మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ జన్మదినోత్సవాన్ని సూరంపాలెం గ్రామంలోని మండల పరిషత్‌ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం ఎం.ముత్తయ్య మాట్లాడుతూ అబ్దుల్‌ కలాం నూతన విద్యావ్యవస్థను రూపొందించారని ఆయనకు ఘన నివాళులర్పించడం మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.