May 14,2023 13:34
park

ప్రపంచంలోని అతిపెద్ద పక్షి శిల్పానికి ఆతిథ్యమిస్తుంది కొల్లాంలోని పర్యాటక ఆకర్షణ జటాయు ఎర్త్‌ సెంటర్‌. కేరళలోని ఈ జటాయు పార్క్‌ ఒక భారీ ప్రకృతి ఉద్యానవనం. ఇది కేరళలోని కొల్లాంలో చదయమంగళంలో ప్రముఖ పర్యాటక కేంద్రం. దీనిని డిసెంబర్‌ 5, 2017న ప్రారంభించారు. ఈ భారీ కాంక్రీట్‌ శిల్పాన్ని రాజీవ్‌ ఆంచల్‌ 10 సంవత్సరాల పాటు కష్టపడి 'జటాయుపర' వద్ద చెక్కారు. ఈ శిల్పం 65 ఎకరాల్లో గుహలు, పర్వతాలు, కొండలు మరియు లోయలతో బహుళ భూభాగంలో విస్తరించి ఉంది. జటాయు విగ్రహం 200 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఫంక్షనల్‌ పక్షి శిల్పంగా అబ్బురపరుస్తోంది.

 

bird

 

sneha 11