
ప్రపంచంలోని అతిపెద్ద పక్షి శిల్పానికి ఆతిథ్యమిస్తుంది కొల్లాంలోని పర్యాటక ఆకర్షణ జటాయు ఎర్త్ సెంటర్. కేరళలోని ఈ జటాయు పార్క్ ఒక భారీ ప్రకృతి ఉద్యానవనం. ఇది కేరళలోని కొల్లాంలో చదయమంగళంలో ప్రముఖ పర్యాటక కేంద్రం. దీనిని డిసెంబర్ 5, 2017న ప్రారంభించారు. ఈ భారీ కాంక్రీట్ శిల్పాన్ని రాజీవ్ ఆంచల్ 10 సంవత్సరాల పాటు కష్టపడి 'జటాయుపర' వద్ద చెక్కారు. ఈ శిల్పం 65 ఎకరాల్లో గుహలు, పర్వతాలు, కొండలు మరియు లోయలతో బహుళ భూభాగంలో విస్తరించి ఉంది. జటాయు విగ్రహం 200 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఫంక్షనల్ పక్షి శిల్పంగా అబ్బురపరుస్తోంది.












