హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదలైంది. 55 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బిజెపి హైకమాండ్ విడుదల చేసింది. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎంపీ అర్వింద్ వంటి అగ్రనేతలందరి పేర్లు ఫస్ట్ లిస్ట్లోనే ప్రకటించారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్, గజ్వేల్, హుజూరాబాద్ రెండు స్థానాల నుంచి ఈటల రాజేందర్ బరిలో నిలవనున్నారు.













