
రామచంద్రపురం: పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ సాగిస్తున్న నరమేధాన్ని ఆపాలని, పాలస్తీనా లో శాంతి ని నెలకొల్పాలని సోమవారం రామచంద్రపురం లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ ఎమ్-ఎల్ న్యూ డెమోక్రసీ, జమాతే ఇస్లామీ హింద్,దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ ఎమ్-ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, జమాతే ఇస్లామీ హింద్ రామచంద్రపురం శాఖ అధ్యక్షులు ఫరీద్ హమ్మద్ తదితరులు మాట్లాడుతూ మానవ సమాజం ఆకలి భరిస్తుంది కాని అవమానాలను భరించలేదని.అందుకే తమ మాతఅదేశం కోసం, తమ జాతి రక్షణ కోసం పాలస్తీనా ప్రజలు తెగించి పోరాడుతున్నారని. 75 ఏళ్ళు గా ఆ నేల పాలస్తీనా రక్తంతో తడుస్తూనే ఉందని. పాలస్తీనా ప్రజలను తమ మాతఅదేశం నుండి తరిమి వేయాలని ఇజ్రాయిల్ చూస్తుందని. గత 6 నెలలు ఇజ్రాయిల్ ప్రభుత్వం పాలస్తీనా ప్రజల ఆస్తులను, భూములను స్వాధీనం చేసుకుంటూ విధ్వంసానికి పలుపడుతుందని. హమాస్ అనేది పాలస్తీనా రాజకీయ పార్టీ పాలస్తీనా లో ప్రజల హక్కులు కోసం పోరాటం చేస్తుందని. ఇజ్రాయిల్- పాలస్తీనా ఘర్షణ లు జరిగినపుడల్లా పాలస్తీనా మిలిటెంట్లు తమ పై రాకెట్ల ప్రయోగానికి తెగించినందుకువల్లనే వైమానిక దాడులకు ఇజ్రాయిల్ పాల్పడవలసి వస్తుందని ప్రచారం జరుగుతోందని. అరబ్బుల నిర్మూలనే లక్ష్యంగా ఏర్పడిన ఇజ్రాయిల్ ని తమ జాతి మనుగడ కోసం పోరాడుతున్న పాలస్తీనా ఒకే గాటన కట్టి మీడియా ప్రచారం చేయడం అత్యంత హేయమైనది. నీతి బాహ్య మైనదని అన్నారు. తమ ఊపిరి కోసం ,తమ ఉనికి కోసం గెరిల్లా తరహా దాడులకు పాల్పడిన హమాస్ దుర్మార్గాన్ని వేలెత్తి చూపే వారు పాలస్తీనాను నిత్యం నెత్తురోడుతున్న గాయంగా మార్చిన ఇజ్రాయిల్ నెత్తుటి దాహాన్ని గురించి మాట్లాడక పోవడం నిజంగా ఆశ్చర్యమేస్తుందని అన్నారు. ఇజ్రాయిల్ చేస్తున్న దాడులకు, ఆక్రమణలకూ వ్యతిరేకంగా హమాస్ అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై మెరుపు దాడి చేసిందని. ఇజ్రాయిల్ ఆకస్మిక దాడికి ప్రతీకారంగా మానవత్వాన్ని మరిచి గాజా నివాసాలు పై ఇజ్రాయిల్ గత 23 రోజులు నుండి బాంబులు వర్షం కురిపిస్తుందని,నెత్తురు టేరులు పారిస్తుంది. ఈ యుద్ధం లో సుమారు 10వేలకు పైగా పాలస్తీనా ప్రజలు మరణించారని, 3వేలకు పైగా చిన్నపిల్లలు చనిపోయారని,వేలాది మంది క్షతగాత్రులయ్యారని అన్నారు. నేటికి ఇజ్రాయిల్ పాలస్తీనా ఆసుపత్రిలు, పాఠశాలలు మీద బాంబు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అమెరికా, ఇండియా, బ్రిటన్ లాంటి దేశాలు ఇజ్రాయిల్ కు మద్దతు ప్రకటించడం సరైంది కాదని అన్నారు. తక్షణమే ఐక్యరాజ్య సమితి ఇజ్రాయిల్ పై చర్య తీసుకోవాలని, పాలస్తీనా లో ఇజ్రాయిల్ నరమేధాన్ని ఆపాలని, పాలస్తీనా లో శాంతి స్థాపనకు కఅషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ కె ఎం ఎస్ ఉమ్మడి జిల్లా నాయకులు వి. భీమా శంకర్, పీ డీ ఎస్ యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బి. సిద్దూ, అంబటి కఅష్ణ, వి. రామకఅష్ణ, లాజర్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు..