తిరువనంతపురం : తిరువనంతపురంలోని సర్కారా దేవి ఆలయంలో ఆయుధ శిక్షణకు అనుమతి లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. తన ఆదేశాల అమలులో ఆలయ బాధ్యతలు చూస్తున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుకు అవసరమైన సాయం అందించాలని పోలీసులను ఆదేశించింది. ఆలయంలో ప్రతి రోజూ సాయంత్రం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విన్యాసాలు, ఆయుధ శిక్షణ జరుగుతున్నాయంటూ ఇద్దరు భక్తులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు అనిల్ కె నరేంద్రన్, పీజీ అజిత్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కేరళలో తన యాజమాన్యంలో నడుస్తున్న దేవాలయాలలో ఆర్ఎస్ఎస్ సంస్థ ఆయుధ శిక్షణ ఇవ్వడాన్ని నిషేధిస్తూ 2016 లోనే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సర్క్యులర్ జారీ చేసింది. దేవాలయం ఆవరణలో ఆర్ఎస్ఎస్ సభ్యులు పొగాకు ఉత్పత్తు లను వినియోగించడంతో వెలువడే దుర్వాసనతో భక్తులు ఇబ్బం దులు పడుతున్నారని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. విన్యాసాలలో భాగంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్ద శబ్దంతో నినాదాలు చేయ డం వల్ల ప్రశాంతతకు భంగం వాటిల్లుతోందని కూడా తెలిపారు.










