ప్రజాశక్తి-కర్నూలు : కర్నూలులోని మేడం కాంపౌండ్లో నూతనంగా నిర్మించిన ''లలిత జ్యుయెల్లర్స్'' షోరూమ్ను ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దంపతులు రిబ్బన్ కట్ చేసిి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్యెల్యే ఎం.ఏ.హఫీజ్ ఖాన్, రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు ఎస్.సంజీవ్ కుమార్, మేయర్ బీవై.రామయ్య, డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, వార్డ్ కార్పొరేటర్ విజయలక్ష్మీ పాల్గొన్నారు.










