ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : బాబు జగ్జీవన్రామ్ రాజకీయ నాయకుడిగా దేశ గౌరవాన్ని పెంచడమే కాకుండా దళితుల అభ్యున్నతికి అపూర్వమైన కృషి చేశారని కార్పొరేటర్, ఎస్సిసెల్, నగర మహిళ అధ్యక్షురాలు దేవరపల్లి అనిత అన్నారు. టిడిపి ఆధ్వర్యంలో గురువారం స్థానిక గుప్త సెంటర్లో బాబు జగ్జీవన్ రామ్ 37వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర పోరాటం గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా దేశంలోని అణగారినసమాజం ఉద్ధరణ గురించి మాట్లాడినా, దళితుల హక్కుల కోసం పోరాడాలనే మాట వచ్చినా సువర్ణాక్షరాలతో గుర్తుపెట్టుకునే పేరు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సమతా కీర్తి, రాళ్ల కొట్టు రాము, పార్టీ అధ్యక్షులు ఇలియాస్ పాషా, మాజీ జడ్పీటీసీ లంకె నారాయణ ప్రసాద్, పిప్పళ్ల కాంతా రావు, పట్టన మహిళా అధ్యక్షురాలు నలిగిలి వసంత, బచ్చుల బోస్, కార్పొరేటర్ సుధాకర్, పి.వి.ఫణి కుమార్, మాజీ కౌన్సిలర్ బొడ్డు శ్రీను, బొమ్మిడి శ్రీరాములు, లింగం విజరు, కుంభ రవికిరణ్, లలిత రాజు, గోకుల్ శివ, చిన్నం శివనాగేశ్వర రావు, నారగాని కృష్ణ, చిన్ని, బాషా, భూపతి త్రిపుర, శ్రీదేవి, లంకె హరి, కోడలి మోషే పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










