
ఖమ్మం: ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్నిప్రమాదం సంభవించింది. అందులో నిల్వకు ఉంచిన పత్తి బస్తాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో షెడ్డులో ఉన్న దాదాపు 1600 పత్తి బస్తాలన్నీ కాలిపోయినట్లు తెలుస్తోంది. పక్క షెడ్డులోని బస్తాలకు కూడా మంటలు వ్యాపించే క్రమంలో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసి నిల్వ చేసుకున్న వ్యాపారికి సుమారు రూ.1.25 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా.