Nov 02,2023 16:03

ప్రజాశక్తి - ఆలమూరు : మండలంలోని జన్నాడ,గుమ్మిలేరు, ఆలమూరు లలో జగనన్న నవరత్నాల్లో భాగంగా 2 వేలు ఇళ్లస్థలాల సంబంధించి లబ్ధిదారులందరికీ పట్టాలు పంపిణీకి లేఅవుట్‌ లలో అంతా సిద్ధం చేసినట్లు తాహసిల్దార్‌ ఐపి.శెట్టి అన్నారు. ఈ మేరకు గురువారం మండల రెవెన్యూ కార్యాలయంలో విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి పంపిణీ చేస్తున్నట్లు లబ్ధిదారులందరికీ ఇప్పటికే సమాచారం ఇచ్చామని ఆయన అన్నారు. అలాగే వారంతా కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి చేతుల మీదుగా నిర్ణీత సమయానికి విచ్చేసి పట్టాలు పొందాలని ఆయన కోరారు. ఇవి పూర్తిగా చదును చేసిన భూభాగంలో ఇండ్ల స్థలాలను విభజించి, సర్వే రాళ్లు నాటామన్నారు. అత్యధికంగా ఒక్క గుమ్మిలేరులోనే మండల పరిధి 12 గ్రామాలకు సంబంధించిన గుర్తించిన అర్హులకు 1300 ఇళ్ల స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిటి జానకి రామయ్య, జగనన్న భూసర్వే డిటి జానకి రాఘవ, మండల సర్వేయర్‌ ఏ.సందీప్‌ కుమార్‌, విఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.