Sep 12,2023 07:37

ఉఖ్రుల్‌ (మణిపూర్‌) : మణిపూర్‌లోని ఉఖ్రుల్‌ జిల్లాలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. జాతీయ భూకంప కేంద్రం ప్రకారం.. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.1గా నమోదైంది. భూకంప కేంద్ర 20 కిలోమీటర్లు. అంతకుముందు బంగాళాఖాతంలోని జిజాంగ్‌, టిబెట్‌, మొరాకోలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సోమవారం రాత్రి 11:01 గంటలకు సంభవించింది. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని ఎన్‌ఎస్‌సి నుండి అందిన సమాచారం జూలై 21న ఉఖ్రుల్‌లో 3.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.