Feb 01,2023 15:45

తిరుమల :తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని టిటిడి అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, గోమాత ప్రవేశం, గోపూజ, సుదర్శన   హోమం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం కానుకలను వేరుచేయడం, లెక్కించడం చేపడతారని వివరించారు. తిరుమలలో స్వామివారి హుండీ కానుకలు లెక్కించడానికి  బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన  రూ.23 కోట్ల విరాళంతో అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన పరకామణి భవనం నిర్మించారు.