అమరావతి: ప్రముఖ సినీ నటుడు చంద్ర మోహన్ మృతి పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా 932 చిత్రాలలో నటించి నంది, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఆయన మరణం తెలుగు చిత్ర రంగానికి తీరానిలోటన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.










