రాయదుర్గం (అనంతపురం) : అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ... సోమవారం రాయదుర్గంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసన అనంతరం తహసిల్దార్ మారుతికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున, నాగరాజు, తదితరులు వినతిపత్రాన్ని అందించారు.










